Skip to main content

IGNOU: పరీక్షలు ప్రారంభం

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే డిసెంబర్‌–2021 టర్మ్‌ ముగింపు పరీక్షలు మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 11వ తేదీ వరకూ జరుగుతాయని ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం ఇన్ చార్జ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుమలత పేర్కొన్నారు.
ignou
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం

విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ఆదోని, అనంతపురం ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2022లో అన్ని పరీక్ష కేంద్రాలలో 9,699 అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులందరికీ హాల్‌ టికెట్‌లను ఇగ్నో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి తమ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైసూ్కల్‌ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గానీ లేదా 0866–2565253 ఫోన్ నంబర్‌ ద్వారా గానీ సంప్రదించాలని సూచించారు.

చదవండి: 

IGNOU: కొత్త కోర్సును ప్రారంభించిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ

అతి తక్కువ ఫీజుతో డిగ్రీ, పీజీ చదివే అవకాశం.. 

ఉపాధి , నైపుణ్యాలను పెంచే “ఇగ్నో” ఆన్ లైన్ ప్రోగ్రాములు

Published date : 04 Mar 2022 02:55PM

Photo Stories