Skip to main content

AP Open School: సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలు ముందంజ

నరసరావుపేట: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్‌ స్కూలు ఆధ్వర్యంలో జూన్‌, జూలై మాసాల్లో నిర్వహించిన పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలకు సప్లిమెంటరీ పరీక్షల్లో బాలికలు మెరుగైన ఉత్తీర్ణత సాధించారని జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌ బుధవారం పేర్కొన్నారు.
AP Open School:  సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలు ముందంజ
AP Open School: సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలు ముందంజ

జిల్లాలో పదోతరగతి పరీక్షలకు 926 మంది హాజరుకాగా వారిలో బాలికలు 463 మందికి గాను 292 మంది, బాలురు 463 మందికి గాను 204 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇంటర్‌ పరీక్షలకు 2072 మంది హాజరైతే బాలికలు 747 మందికి గాను 444 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 1325 మంది హాజరై 619 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత శాతం 53.56 శాతం కాగా, ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణత శాతం 51.30 శాతంతో రాష్ట్రంలో పదో తరగతిలో 18వ స్థానం, ఇంటర్మీడియేట్‌లో 20వ స్థానంలో నిల్చిందన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి ఆగస్టు నాల్గవ తేదీ వరకు ఏపీటీ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్‌ 26 నుంచి జూలై నాలుగు వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలకు మార్కుల మెమోలను www.apopenschool.ap.gov.inలో పొందుపర్చారన్నారు.

Also read:AP Schools: నాడు–నేడు అభివృద్ధి పనుల పరిశీలన: కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

​​​​​​​2023–24 విద్యాసంవత్సరానికి జూలై 26 నుంచి ఆగస్టు 31వరకు అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దీనికి సంబంధించి ఈ విద్యాసంవత్సరం నుంచి అభ్యర్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమోలు, పాస్‌ సర్టిఫికేట్లు నేరుగా వారి చిరునామాలకు పంపుతామని తెలిపారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఏపీఓఎస్‌ఎస్‌..జ్ఞానధార ప్రత్యేక యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారన్నారు. దీనిలో 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు ఉపయోగకరమైన పాఠ్యాంశాల వీడియోలను పొందుపర్చారన్నారు. అభ్యాసకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ శామ్యూల్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ హుస్సేన్‌ తెలియచేశారు.

Also read: Scholarships: విదేశీ విద్యాదీవెనకు 357 మంది ఎంపిక

Published date : 27 Jul 2023 05:02PM

Photo Stories