Skip to main content

ఆ విద్యార్థులు 10 పూర్తిచేసే వరకు ఫీజు చెల్లించండి

Best Available School Scheme (BASS) కింద ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే ప్రవేశాలు పొంది విద్యాభాస్యం చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని హైకోర్టు జూలై 29న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Pay fees till those students complete 10th Class
ఆ విద్యార్థులు 10 పూర్తిచేసే వరకు ఫీజు చెల్లించండి

బీఏఎస్‌ఎస్‌ను రద్దుచేస్తూ ప్రభుత్వం 2021 ఆగస్టు 27న జారీచేసిన జీవో 19ని హైకోర్టు రద్దుచేసింది. బీఏఎస్‌ఎస్‌ పథకం కింద అర్హత పొంది 2 నుంచి 8వ తరగతి వరకు ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు 10వ తరగతి పూర్తిచేసేవరకు వారిని అవే పాఠశాలల్లో కొనసాగిస్తూ వారికి ఫీజు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు తీర్పు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2008లో బీఏఎస్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. అయితే నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాలు, మంచి విద్యాబోధన అందిస్తుండడంతో ప్రభుత్వం బీఏఎస్‌ పథకాన్ని రద్దుచేస్తూ 2021లో జీవో జారీచేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ మాలమహానాడు ఐక్యవేదిక, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారించిన జస్టిస్‌ గంగారావు జూలై 29న తీర్పు చెప్పారు.

చదవండి: 

Published date : 30 Jul 2022 03:07PM

Photo Stories