Skip to main content

pharmacy: ఫార్మ‌సీ రంగంలో అగ్ర‌స్థానానికి భార‌త్‌

రాయ‌నిగూడెం: రానున్న రోజుల్లో భార‌త‌దేశం ఫార్మారంగ ఎగుమ‌తుల్లో అగ్ర‌స్థానానికి చేరుకుంటుంద‌ని పాల‌మూరు యూనివ‌ర్సిటీ ఫార్మ‌సీ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెస‌ర్ వి ప్ర‌భాక‌ర్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. రాయ‌నిగూడెంలోని వికాస్ కాలేజీ ఆఫ్ ఫార్మాసూటిక‌ల్ సైన్సెస్ క‌ళాశాల వార్షికోత్స‌వాలు శ‌నివారం(ఫిబ్ర‌వ‌రి 25) అట్ట‌హాసంగా జ‌రిగాయి.
Vikas College Of Pharmacy

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌, మేకిన్ ఇండియా కార్యక్ర‌మాల ద్వారా ఫార్మ‌సీ రంగం గ‌ణ‌నీయాభివ‌`ద్ధి చెందుతోంద‌న్నారు. క‌రోనా కాలంలో ప్ర‌పంచానికి జౌష‌ధాల‌ను ఎగుమ‌తి చేసే స్థాయికి భార‌త్ చేరుకుంద‌న్నారు. సొంతంగా క‌రోనా వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన ఘ‌న‌త ఇండియాకు ద‌క్కింద‌న్నారు. అలాగే కాలేజీ స్థాపించిన ఈ 18 ఏళ్ల‌లో ఇక్క‌డ చ‌దువుకున్న వేలాది మంది విద్యార్థులు, దేశీయంగా అలాగే విదేశాల్లో ఉన్న‌త స్థానాల్లో స్థిర‌ప‌డ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో క‌ళాశాల చైర్మ‌న్ ర‌ఘుదాస్‌, క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

చ‌ద‌వండి: ఒకే మెయిల్‌తో రూ.90 ల‌క్ష‌లు రాబ‌ట్టిన చాట్ జీపీటీ...

చ‌ద‌వండి: కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే ఎలా స్పందించాలో తెలుసా...

Published date : 27 Feb 2023 06:56PM

Photo Stories