Skip to main content

Atmanirbhar Bharat: పెయింటింగ్‌ పోటీల్లో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

నెల్లిమర్ల: సతివాడ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పెయింటింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
Talent of exemplary students in painting competitions  Best paintings by students in Nellimarla

 ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఆలిండియా పెయింటింగ్‌ పోటీల్లో ఈ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ జె.పద్మలత, ఉపాధ్యాయ సిబ్బంది, తోటి విద్యార్థులు విజేతలను న‌వంబ‌ర్ 29న‌ అభినందించారు.

చదవండి: Free training in fabric painting: మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ

వెయిట్‌లిప్టింగ్‌ పోటీల్లో విజేతకు అభినందనలు

సతివాడ ఆదర్శపాఠశాల 9 వతరగతి విద్యార్థి బి.రామ్‌జీ కర్నూలు జిల్లాలో ఈనెల 23,25వ తేదీల్లో జరిగిన అండర్‌–17 వెయిట్‌లిప్టింగ్‌ పోటీల్లో ప్రధమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయివెయిట్‌ లిప్టింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు, ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ జె.పద్మలత, ఉపాధ్యాయు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

Published date : 30 Nov 2023 03:22PM

Photo Stories