Skip to main content

Andhra Padesh: ఏపీలో రూ.200 కోట్ల‌తో దివ్యాంగుల‌కు స్టేడియం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో స్టేడియం నిర్మించనున్నారు.
200 Crore Stadium For the Disabled in Visakhapatnam

ఏపీలోని విశాఖపట్నంలో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో దివ్యాంగుల కోసం ప్రత్యేక స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ దివ్యాంగులకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన సౌకర్యాల్ని అందిస్తుంది.

అమరావతిలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుతో మంత్రివ్యక్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2025లో జరుగనున్న రాష్ట్ర పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలకు మంత్రిని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ కృషి గురించి మాట్లాడిన మంత్రి, దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చాలా అడుగులు వేస్తోందని చెప్పారు. 

Railway Station: ఏపీలో.. ఈ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.271.43 కోట్లు

ముఖ్యంగా.. దివ్యాంగులకు పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారని పేర్కొన్నారు. అంతే కాదు, మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.

అలాగే.. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి నెలా పింఛన్ డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉచిత ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, త్రీ వీలర్స్ కూడా దివ్యాంగ విద్యార్థులకు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

AP Voters: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓటర్లు 4,14,40,447

Published date : 30 Jan 2025 08:23AM

Photo Stories