అనంతగిరి: డ్రాపౌట్స్ లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆగస్టు 22న ఆయన సందర్శించారు.
డ్రాపౌట్స్పై దృష్టి పెట్టండి
ముందుగా తరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి, మళ్లీ కళాశాలలో చేర్పించాలని సూచించారు. చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని ప్రిన్సిపాల్ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్