Skip to main content

Tenth Class: ‘పది’ పరీక్షలు ప్రశాంతం!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 23 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
Tenth Class
‘పది’ పరీక్షలు ప్రశాంతం!

కోవిడ్‌–19 నేపథ్యంలో సిలబస్‌ తగ్గించడంతో పాటు పరీక్ష పేపర్లను సైతం ప్రభుత్వం కుదించింది. దీంతో 11 పరీక్షలకు ఆరు పరీక్షలను నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మొత్తం 2,861 పరీ„ కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు.

చదవండి: 

After Class 10th

Published date : 30 May 2022 05:44PM

Photo Stories