Skip to main content

Education and Health: విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

గద్వాల రూరల్‌/ఎర్రవల్లి: విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.
Education and Health

సెప్టెంబ‌ర్ 26న‌ గద్వాల మండలం వీరాపురం సమీపంలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్‌ కళాశాల, పాఠశాలను, ఎర్రవల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ సందర్శించారు.

చదవండి: Teachers Adjustment: టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో నాణ్యమైన విద్య ఎంతో ముఖ్యమని, విద్యాప్రమాణాలు మెరుగుపర్చేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

భోజన నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రిన్సిపల్‌ శ్రీరేఖ, ఎస్‌ఓ ఆసియాబేగం, ఉపాధ్యాయులు శివప్రసాద్‌, యశోద తదితరులు పాల్గొన్నారు.

Published date : 30 Sep 2024 05:07PM

Photo Stories