Skip to main content

Harish Rao: 10జీపీఏ విద్యార్థులకు రూ.10వేలు నగదు పురస్కారం

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో పదో తరగతిలో ప్రతిభను కనబర్చిన ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులకు మంత్రి హరీశ్‌ రావు నగదు పురస్కారాలను అందజేయనున్నారు.
Harish Rao
10జీపీఏ విద్యార్థులకు రూ.10వేలు నగదు పురస్కారం

విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు పదో తరగతి పరీక్షల ముందు హరీశ్‌ రావు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పదో తరగతిలో 10జీపీఏ మార్కులు సాధిస్తే రూ.10వేల నగదు, 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలకు రూ.25వేల నగదు పురస్కారాలను అందించనున్నారు.

చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

మే 10న విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 126 మంది విద్యార్థులు 10జీపీఏ సాధించగా, 219 ప్రభుత్వ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా వ్యాప్తంగా రూ. 67.35 లక్షల నగదు పురస్కారాలను మంత్రి జూన్‌లో అందించనున్నారు.

చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

Published date : 11 May 2023 03:26PM

Photo Stories