2021-22 విద్యాసంవత్సరానికి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
దరఖాస్తుల గడువు పెంపు..!
అయితే రాష్ట్రంలోని అన్ని కాలేజీల ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అలాగే దివ్యాంగ విద్యార్థులు 2022 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీ యాజమాన్యాలు లేదా విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ-పాస్ పోర్టల్లో ఈ దరఖాస్తులను అప్లోడ్ చేయాలని తెలిపింది.