రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజులపాటు జూలై 11, 12, 13న అన్ని విద్యాసంస్థలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సెలవులు ప్రకటించారు.
విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మూడు రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జూలై 10న పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తం చేస్తూనే.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సచివాలయంలో తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. కలెక్టర్లతో ప్రతీ ఆరుగంటలకోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. కాగా, సీఎం ఆదేశాల నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.