2023–24 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ బోధనకు 1,074 మంది గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
1,074 మంది ఫ్యాకల్టీ నియామకానికి ఆదేశాలు
గత విద్యాసంవత్సరంలో పనిచేసిన 783 మంది గెస్ట్ ఫ్యాకల్టీ సేవలను పునరుద్ధరించడంతో పాటు కొత్తగా 291 మంది గెస్ట్ ఫ్యాకల్టీని నియమించేందుకు మే 25న ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ను ఆదేశించింది. గంటకు రూ.150 చొప్పున, గరిష్టంగా నెలకు రూ.10 వేల వరకు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.