Skip to main content

Government Jobs: ప్రభుత్వ కొలువుల్లో సైన్స్‌ కళాశాల విద్యార్థులు

బంజారాహిల్స్‌: సైఫాబాద్‌ యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో విద్యాభ్యాసం చేసి 40 మంది విద్యార్థులు ప్రభుత్వ కొలువులను సాధించారు.
Students of Science College in Govt

వీరు పలు విభాగాల్లో సెలక్ట్‌ కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌నాయక్‌ సంతోషం వ్యక్తం చేశారు. 40 మంది 21 మంది జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), టీజీటీ, పీజీటీల్లో, అలాగే మరో 19 మంది విద్యార్థులు కానిస్టేబుళ్ల ఉద్యోగాలను పొందారు.

చదవండి: MD Shabina: ఏకకాలంలో మూడు ఉద్యోగాలకు ఎంపిక

మార్చి 4న‌ లక్ష్మణ్‌నాయక్‌ తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. వినోద్‌కుమార్‌ అనే విద్యార్థి ఒక్కటేసారి మూడు జాబ్‌లను సాధించడం పట్ల సన్మానించారు.

విద్యార్థులకు అకడమిక్‌ అంశంలో ప్రాముఖ్యత నివ్వడం వల్లనే సైఫాబాద్‌ కాలేజీ నుంచి ఇంతమంది ఉద్యోగాలను సాధించారని చెప్పారు. వివిధ నిర్వహణలో ఉన్నత విలువలను పాటిస్తూ భవిష్యత్తులో మరెన్నో పదవులను వారు అధిరోహించాలని ఆకాంక్షించారు.

చదవండి: Degree Lecturer Results: కాలు కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో.. ప్రథమ స్థానం కైవసం చేసుకున్న గణేశ్‌

Published date : 05 Mar 2024 01:46PM

Photo Stories