Skip to main content

Promotions: తహసీల్దార్లకు పోస్టింగ్‌

మంచిర్యాల అగ్రికల్చర్‌: ఉమ్మడి జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లుగా పదోన్నతి పొందగా ఆయా జిల్లాల్లో పోస్టింగ్‌ కేటాయిస్తూ సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సెప్టెంబర్ 3న‌ ఉత్తర్వులు జారీ చేశారు.
Posting to Tehsildars news in telugu

ఇటీవల పదోన్నతులు పొందిన వారికి మల్టీ జోన్‌ పరిధిలో ఖాళీల ప్రకా రం జిల్లాలకు కేటాయించారు. ముగ్గురు మంచి ర్యాల, నిర్మల్‌ జిల్లా నుంచి ఒకరిని ఆదిలాబాద్‌కు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ఒకరిని ఆదిలాబాద్‌కు, మరొకరికి జగిత్యాల జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు.

చదవండి: Engineering Seats: కారణాల్లేకుండా ఎలా తిరస్కరిస్తారు?: హైకోర్టు

ఇక పెద్దపల్లి జిల్లా నుంచి ముగ్గురిని, జగిత్యాల జిల్లా నుంచి ఒకరిని ఆసిఫాబాద్‌ జిల్లాకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఒకరిని మంచిర్యాల జిల్లాకు ఇచ్చారు. వీరికి ఖాళీల ప్రకారం మండలాల్లో విధుల్లో చేరనున్నారు.

Published date : 04 Sep 2024 03:19PM

Photo Stories