Skip to main content

TS Gurukula schools : ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి

మధిర: గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కేర్‌ టేకర్‌ బాధ్యతల నుంచి తొలగించి కేవలం బోధనకే పరిమితం చేయాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.రంగారావు కోరారు. మధిర మైనార్టీ గురుకుల పాఠశాలను సోమవారం యూనియన్‌ నాయకులు సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న పీఆర్‌టీయూ నాయకులు
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న పీఆర్‌టీయూ నాయకులు

అనంతరం రంగారావు మాట్లాడుతూ గురుకులాల్లోని ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ఉపాధ్యాయులకు వార్డెన్‌ డ్యూటీ కేటాయించడం సరికాదని, కేర్‌ టేకర్లుగా ఇతరులను నియమించి ఉపాధ్యాయులపై భారం తగ్గించాలన్నారు. 

Also read: National Academy of Construction: ఆగస్టు 11న మినీ జాబ్‌మేళా

Published date : 08 Aug 2023 04:28PM

Photo Stories