Skip to main content

Kim Jong Un : 5000 ట‌న్నుల నౌకాద‌ళం ప్రారంభం.. కిమ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ 5 వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను ప్రారంభించారు.
Kim launches 5000 ton navy as new destroyer

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ 5 వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను ప్రారంభించారు. త‌మ నౌకాద‌ళాన్ని బ‌లోపేతం చేసేందుకు ఇది మ‌రో అడుగని తెలుస్తోంది. అమెరికాతో సహా దాని మిత్రపక్షాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు కిమ్‌ తన అణుసామర్థ్యాలను పెంచుకొంటున్నట్లు కనిపిస్తోంది. ఇక‌, ఈ కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం, 25 ఏప్రిల్‌న నాంపోలోని ప‌శ్చిమ పోర్టులో జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

వ‌చ్చేఏడాది ప్రారంభంలోనే..

శుక్ర‌వారం నిర్వ‌హించిన ఈ కార్యక్రమంలో అధ్య‌క్షుడు కిమ్‌ మాట్లాడుతూ.. అణు సామర్థ్య బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులతో సహా వివిధ ఆయుధ వ్యవస్థలను నిర్వహించడానికి దీన్ని రూపోందించామ‌ని, వ‌చ్చే ఏటా మొద‌ట్లోనే దీనిని నౌకాదళానికి అప్పగిస్తామ‌ని వివ‌రించారు.

Tashkent Agreement : ద‌శాబ్ధాల ఒప్పందం.. వైదొలిగే యోచనలో పాక్..!

దక్షిణ కొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించిన ఆయన.. అవి యుద్ధానికి సన్నాహాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం, పరిణామాలపై నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇక, కిమ్‌ ప్రారంభించిన యుద్ధ నౌకను గురించి దక్షిణ కొరియా ఇప్పటివరకు ఏ ప్రకటనా చేయలేదు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కిమ్‌ చర్య ఆందోళన కలిగిస్తోంది.

కిమ్.. ఒక న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్‌..

2019లో అణ్వాయుధాలు వదిలే విషయంలో అధ్య‌క్షుల మ‌ధ్య జరిగిన చర్చలు విఫలమైనప్ప‌టికి, వీరి మ‌ధ్య దూరం కూడా పెరిగింది. ఇక‌, బైడెన్ ప్ర‌భుత్వం వచ్చిన తర్వాత అది వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇటీవల అగ్రరాజ్యంపై కిమ్‌ వైఖరి కఠినంగా మారడంతో, ట్రంప్‌తో ఎలాంటి వ్యక్తిగత దౌత్యాలు నడపకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Missile Test in Pakistan: క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్

అయితే, కిమ్‌తో త‌నకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, త‌ను ఒక న్యూక్లియర్‌ పవర్‌ అని కొనియాడారు ట్రంప్‌. ఇక‌దిలా ఉంటే, మరోవైపు.. దక్షిణ కొరియా-అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది. దక్షిణ‌ కొరియా-యూఎస్ సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహంగా కిమ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల దక్ష‌ణ కొరియాలోని బుసాన్ పోర్ట్‌లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను అమలు చేయ‌డం, కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్‌ అమెరికాను ఉద్ధరించి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Apr 2025 08:23AM

Photo Stories