Skip to main content

10th class results: 10వ తరగతి ఫలితాల్లో.. ప్రైవేట్‌ స్కూల్స్‌ దీటుగా.. ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన ఆణిముత్యాలు వీళ్లే..

10th class results
10th class results

చిత్తూరు కలెక్టరేట్‌ గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయని విధంగా వైఎస్సార్‌సీపీ సర్కారు విద్యాభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసింది. పేద విద్యార్థులు విద్యనభ్యసించే సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలుతో పేదింటి పిల్లల చదువులు సమున్నత స్థాయికి చేరాయి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ బోధన అందించారు. దీంతో విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెరిగాయి. తాజాగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి శభాష్‌ అనిపించుకున్నారు.

కార్పొరేట్‌ను తలదన్నేలా ..

ఒక్కప్పుడు కార్పొరేట్‌ విద్యారంగానికే పరిమితమైన స్టేట్‌ ర్యాంకులు, మండల ర్యాంకులను ప్రస్తుతం ప్రభుత్వ బడుల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. గత ఐదు సంవత్సరాల్లో జిల్లాలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్‌ రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌ , అత్యుత్తమ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపునకు దోహదపడ్డాయి.

ప్రభుత్వ బడుల్లో మండలాల వారీగా ఇలా...

జిల్లాలోని ప్రభుత్వ బడులకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. హేమ 592 మార్కులు (మంగళపల్లి జెడ్పీ, బంగారుపాళ్యం), అలేఖ్య 592 మార్కులు(విజయపురం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌), చందు, మంజుల 590 (బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గురుకుల), రెడ్డి ప్రసన్న 589 (పుంగనూరు బాలికల పాఠశాల), భావన 588 (పలమనేరు బాలికల పాఠశాల), కుష్‌ నిహాజ్‌ 587 (పులిచెర్ల మండలం కల్లూరు జెడ్పీ) , సుష్మశ్రీ 587 (పెద్దపంజాణి మండలం శంకర్‌రాయలపేట బీసీ గురుకుల), దినీషా 586 (పూతలపట్టు మండలం పి.కొత్తకోట జెడ్పీ), శ్రావణి 586 (కుప్పం మండలం, గరిగశీనేపల్లి జెడ్పీ), రిషిత 585 (రొంపిచెర్ల మండలం ఏపీ మోడల్‌ స్కూల్‌), రితిక 584 (వి.కోట మండలం వి.కోట బాలికలు), యోగిత 583 (గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి జెడ్పీ), జయంత్‌ 583 (ఐరాల మండలం ఎం.పైపల్లి జెడ్పీ), సుదర్శన్‌ 582 (సదుం మండలం బీసీ గురుకుల), కౌసర్‌ 582 (చిత్తూరు అర్బన్‌ డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాల), సతీష్‌ 582 (నగరి మండలం చింతలపట్టెడ జెడ్పీ), విష్ణు 581 (ఎస్‌ఆర్‌పురం మండలం ఎస్‌ఆర్‌పురం జెడ్పీ), లిఖిత 580 (చౌడేపల్లి మండలం ఏ.కొత్తకోట జెడ్పీ), మేఘన 578 (వెదురుకుప్పం మండలం జక్కదొన జెడ్పీ), భానుప్రకాష్‌ 577 (సోమలమండలం పెద్దఉప్పరపల్లి జెడ్పీ), ప్రశాంత్‌ (కార్వేటినగరం మండలం కత్తెరపల్లి), హారతి (గంగవరం మండలం జీఎల్‌ఎస్‌ఫార్మ్‌ జెడ్పీ), భూమిక (యాదమరి మండలం డీకే చెరువు జెడ్పీ) 576 మార్కులు, జ్ణానహర్ష (పెనుమూరు మండలం జెడ్పీ), సబీహా సధాఫ్‌ (రామకుప్పం మండలం రామకుప్పం బాలికలు జెడ్పీ) 571 మార్కులు, సింధుభార్గవి 568 (గుడిపాల మండలం కేటీపల్లి జెడ్పీ), ఇందుజా (శాంతిపురం మండలం ఏపీమోడల్‌), స్వప్న (గుడుపల్లి మండల కేంద్రం జెడ్పీ) 567 మార్కులు, అభినయ 563 (పాలసముద్రం మండలం టీఆర్‌పురం జెడ్పీ), మౌనేష్‌ 554 (తవణంపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ), వికాస్‌ 545 (చిత్తూరు రూరల్‌ మండలం బీఎన్‌ఆర్‌పేట హైస్కూల్‌), అనుష్క 542 (నిండ్ర మండల కేంద్రంలోని హైస్కూల్‌) లో ఉత్తమ ఫలితాలు సాధించారు.

గుడిపాల మండలంలో అత్యధిక ఉత్తీర్ణత

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో 67.06 ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అత్యధికంగా గుడిపాల మండలం పదో తరగతి విద్యార్థులు 95.6 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా శ్రీరంగరాజపురం మండలంలో 35.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగిలిన మండలాల్లో బైరెడ్డిపల్లిలో 66.98, బంగారుపాళ్యం 54.78, చిత్తూరు 75.92, చౌడేపల్లి 64.94, గంగాధర నెల్లూరు 60.09, గంగవరం 73.69, గుడుపల్లి 54.17, ఐరాల 68.77, కార్వేటినగరం 71.12, కుప్పం 61.65, నగరి 67.8, నిండ్ర 66.49, పలమనేరు 70.56, పాలసముద్రం 81.87, పెద్దపంజాణి 70.49, పెనుమూరు 57.51, పులిచెర్ల 54.34, పుంగనూరు 72.61, పూతలపట్టు 85.91, రామకుప్పం 49.78, రొంపిచెర్ల 58.62, శాంతిపురం 57.62, సదుం 85.71, సోమల 75.14, తవణంపల్లి 80.66, వెదురుకుప్పం 70.64, వి.కోట 57.26, విజయపురం 70.71, యాదమరి 64.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

గత వైఎస్సార్‌సీపీ సర్కారు పాలనలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ ఫలితం నేడు కనిపిస్తోంది. బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని సర్కారు బడుల విద్యార్థులు ప్రతిభ చాటారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించి మండల టాపర్‌లుగా నిలిచారు.

Published date : 24 Apr 2025 06:15PM

Photo Stories