Skip to main content

Collector Sree Harsha: టీచర్లను మందలించిన కలెక్టర్‌

నారాయణపేట రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీహర్ష హెచ్చరించారు.
Collector Sree Harsha
టీచర్లను మందలించిన కలెక్టర్‌

ఆగ‌స్టు 3న‌ ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మారని టీచర్ల తీరు’ కథనానికి కలెక్టర్‌ స్పందించారు. దామరగిద్ద మండలం వత్తుగుండ్లతండాలో పనిచేస్తున్న హెచ్‌ఎం వికాస్‌, ఉపాధ్యాయుడు వెంకటేష్‌కు డీఈఓ కార్యాలయం నుంచి మెమో జారీ చేయమని ఆదేశించడంతో, ఆగ‌స్టు 3న‌ వారికి కాంప్లెక్స్‌ హెచ్‌ఎం బాలాజీ అందించారు. అదేవిధంగా సాయంత్రం తన కార్యాలయానికి సదరు టీచర్లను పిలిపించిన కలెక్టర్‌ వారిని తీవ్రస్థాయిలో మందలించారు.

చదవండి: Teachers Problems: PRTUతోనే సమస్యలు పరిష్కారం

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఇక నుంచి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని హెచ్చరించారు. అలాగే ‘ఆడిట్‌ పేరుతో పాఠశాలకు డుమ్మా’ శీర్షికన ‘సాక్షి’లో ఆగ‌స్టు 3న‌ ప్రచురితమైన కథనం విషయమై సెక్టోరియల్‌ అధికారులతో చర్చించినట్లు సమాచారం. టీచర్లు పాఠశాలలకు రెగ్యులర్‌గా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వెలుగు అభ్యాసదీపిక సమర్థవంతంగా అమలు చేసేలా డీఆర్‌పీల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు.

చదవండి: Memos for Teachers: ఉపాధ్యాయులకు మెమోలు

Published date : 04 Aug 2023 03:31PM

Photo Stories