నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంపై ఆగస్టు 2న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మారని టీచర్ల తీరు’ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు.
వత్తుగుండ్లతండా పాఠశాలను తనిఖీ చేస్తున్న ఎంఈఓ
డీఈఓ రవిందర్ ఆదేశాల మేరకు ఆగస్టు 2న మధ్యాహ్నం ఎంఈఓ గోపాల్నాయక్ దామరగిద్ద మండలం వత్తుగుండ్లతండా పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో హెచ్ఎం వికాస్ అందుబాటులో లేరు. ఆడిట్ చేయించడానికి నారాయణపేటలోనే ఉన్నారు.
అంతకుముందు క్లస్టర్ హెచ్ఎం బాలాజీ పాఠశాలకు వెళి ఆలస్యంగా వచ్చిన టీచర్లకు మెమోలు జారీ చేశారు. సమయపాలన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాళం బయటి వారికి ఇవ్వరాదని సూచించారు. అనంతరం విద్యార్థుల స్థాయిని పరిశీలించారు.