Skip to main content

Teachers Problems: PRTUతోనే సమస్యలు పరిష్కారం

జగిత్యాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్‌టీయూతోనే సాధ్యమవుతుందని ఈసంఘం జిల్లా అధ్యక్షుడు యాళ్ళ అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు.
Teachers Problems
PRTUతోనే సమస్యలు పరిష్కారం

పీఆర్‌టీయూ సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా ఆగ‌స్టు 3న‌ జగిత్యాల అర్బన్‌ మండలాల్లో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కరింపబడుతాయని, పెండింగ్‌ బిల్లుల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేవారు.

చదవండి: KGBVల్లో టీచర్లను కొనసాగించాలి.. ఖాళీగా పీజీటీ పోస్టులు

2003 డీఎస్సీ వాళ్లకు ఆగ‌స్టు 31 లోపు పాత పెన్షన్‌, అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసేలా హెల్త్‌ కార్డులను తీసుకవస్తామని పేర్కొన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు టైమ్‌స్కేల్‌ ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల అర్బన్‌ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ బాసిత్‌, నాయకులు వూటూరి మహేష్‌, సత్యరాజ్‌, శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Teachers: విజన్‌, మిషన్‌తో అభివృద్ధి సాధించాలి

Published date : 04 Aug 2023 01:52PM

Photo Stories