Skip to main content

Teachers: విజన్‌, మిషన్‌తో అభివృద్ధి సాధించాలి

కాళోజీ సెంటర్‌: ఉపాధ్యాయులు విజన్‌, మిషన్‌ ఏర్పాటు చేసుకొని పాఠశాలల అభివృద్ధి సాధించాలని సెక్టోరియల్‌ ఆఫీసర్‌ ఫ్లోరెన్స్‌ అన్నారు.
Teachers
విజన్‌, మిషన్‌తో అభివృద్ధి సాధించాలి

జిల్లాలోని ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నగరంలోని తాళ్ల పద్మావతి కళాశాలలో నిర్వహిస్తున్న శాలసిద్ధి శిక్షణ కార్యక్రమం ఆగ‌ష్టు 1న‌ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్లోరెన్స్‌ హాజరై మాట్లాడారు. స్వీయ మూల్యాంకనం ద్వారా పాఠశాల అభివృద్ధికి ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు.

చదవండి: Teacher Jobs: టీచర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ప్రతి అంశంలో పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సమాజ భాగస్వామ్యం, అధికారుల సహకారంతో అభివృద్ధి ప్రణాళికలు మెరుగుపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కోర్సు డైరెక్టర్‌ రమేష్‌బాబు మాట్లా డుతూ.. పాఠశాల స్థాయిని వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌లు సుధీర్‌బాబు, బాబురావు, వేణుగోపాల్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

చదవండి: School Students: ఉపాధ్యాయుల కొరత తీర్చాలని ఆందోళన

Published date : 02 Aug 2023 03:50PM

Photo Stories