Skip to main content

TGUGCET-2022: రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు..

TGUGSET-2022

తెలంగాణలో సోషల్‌ వెల్ఫేర్‌(మహిళా), ట్రైబల్‌ వెల్ఫేర్‌(మహిళలు, పురుషులు) రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌–2022)కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్ష ద్వారా 2022–23 విద్యాసంవత్సరంలో ఆయా సోషల్‌ వెల్ఫేర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హతలు

  • మే 2022లో ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. వీరు కనీసం 40 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైతేనే ప్రవేశం లభిస్తుంది. అలాగే 2021 మార్చిలో ఇంటర్మీడియెట్‌ ఫైనల్‌ పరీక్షలకు హాజరై 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000; పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు.
  • పురుషుల కాలేజీల్లో అడ్మిషన్స్‌కు పురుషులు, మహిళల కాలేజీల్లో ప్రవేశాలకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ
టీజీయూజీసెట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా అర్హులైన విద్యార్థులకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

పరీక్ష విధానం
టీజీయూజీసెట్‌ పరీక్ష ప్రశ్న పత్రం మొత్తం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. మొత్తం ఐదు గ్రూప్‌లకు(ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ) సంబంధించి పరీక్ష జరుగుతుంది. ప్రతి గ్రూప్‌ పరీక్షలో నాలుగు సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్ట్‌కు 30 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇంటర్మీడియట్‌ స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

పరీక్ష నిర్వహించే గ్రూపులు

  • ఎంపీసీ: ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై ప్రతి సబ్జెక్ట్‌ నుంచి 30 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
  • బైపీసీ: ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలపై ప్రతి సబ్జెక్ట్‌ నుంచి 30 మార్కులకు చొప్పున ప్రశ్నలు ఇస్తారు. 
  • ఎంఈసీ: ఇంగ్లిష్, మ్యాథ్స్, అకౌంట్స్, కామర్స్‌లపై ప్రతి సబ్జెక్ట్‌ నుంచి  30 మార్కులకు చొప్పున ప్రశ్నలను అడుగుతారు.
  • సీఈసీ: ఇంగ్లిష్, ఎకనామిక్స్, అకౌంట్స్, కామర్స్‌లపై ప్రతి సబ్జెక్ట్‌ నుంచి 30 మార్కుల చొప్పున ప్రశ్నలుంటాయి.
  • హెచ్‌ఈసీ: ఇంగ్లిష్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌లపై ప్రతి సబ్జెక్ట్‌ నుంచి 30 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 10.01.2022
  • వెబ్‌సైట్‌: www.tswreis.ac.in/ & http://tgtwgurukulam.telangana.gov.in

చ‌ద‌వండి: Admission in NIRDPR: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories