Job Mela: 127 మందికి ఉద్యోగాలు
పుత్తూరు: రాష్ట్రప్రభుత్వం ఉపాధికల్పనే లక్ష్యంగా జాబ్మేళాలను నిర్వహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు, వైఎస్సార్సీపీ నేత వై.రామ్ప్రసాద్రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్డెవల్మెంట్ కార్పొరేషన్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నేటి యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్రెడ్డి మాట్లాడుతూ 23 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్న జాబ్మేళాలో 321 మంది అభ్యర్థులు పాల్గొనగా 127 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎ.హరి, వైస్ చైర్మన్లు డి.శంకర్, డి.జయప్రకాష్, కళాశాల ప్రతినిధులు టి.నరసింహులు, ఎ.సంధ్య, పి.సుజన, కిషోర్, రసూల్, స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు చైతన్య, అఫ్రిన్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Job Mela: 23న ఏలూరులో జాబ్మేళా.. మేనేజర్, ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు..