Skip to main content

Current Affairs: దేశంలోనే టాప్‌లో ఏపీ... స్వచ్ఛ జల్‌ సే సురక్షలో రెండో స్థానం

గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగు­నీటి సరఫరా కోసం తీసుకుంటున్న చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

‘స్వచ్ఛ జల్‌ సే సురక్ష’ పేరుతో గతేడాది అక్టోబర్‌ 2 నుంచి ఈ ఏడాది జనవరి 26 వరకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేప­ట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగ­స్వా­మ్యంతో దేశంలోని అన్ని గ్రామాల్లో సురక్షిత నీటి వాడకంపై ప్రచార కార్య­క్రమాలు నిర్వహి­స్తోంది.
పరిశీలించిన తర్వాతే మార్కులు
రాష్ట్రాల్లో రక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పరి­శీలించి మార్కులు కేటాయించింది. గ్రామీణ ప్రాం­తాల్లోని తాగునీటి వనరులు(రక్షిత మంచినీటి పథ­కాలు, బోర్లు, బావులు తదితరాలు) వద్ద నీటి నా­ణ్య­త పరీక్షల నిర్వహణను కేంద్ర జల శక్తి శాఖ పరి­శీలించింది. అలాగే నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్‌ తదితర రసాయనాలతో పాటు ఈ–కోలి తదితర బ్యాక్టీ­రి­యా కారకాలను గుర్తించినప్పుడు ప్రభు­త్వాలు తీ­సు­కుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకుంది.

Ap


568 మార్కులతో సెకండ్‌ ప్లేస్‌..
వర్షాకాలం ముందు, తర్వాత నిర్వ­హించిన నీటి నా­ణ్యత పరీక్షల సంఖ్యను.. స్కూళ్లు, అంగన్‌ వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి సౌక­ర్యాలను, నాణ్యత పరీ­క్షల నిర్వహణకున్న వస­తులు, అందులో స్థానిక మ­హిళలకు తగిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తది­తర అంశా­లను కూడా కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. వీటన్నింటి ఆధారంగా 900 మార్కులకు రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. ఈ­సా­రి 900 మార్కులకు గాను 598 మార్కులతో తమిళ­నాడు మొదటి స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌ 568 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది.

చ‌ద‌వండి: రెండు నెలల్లో వైజాగ్‌ రాజధాని... టార్గెట్‌ ఐటీ హబ్‌


96 శాతం నీటి వనరుల వద్ద నాణ్యత పరీక్షలు..
ఏపీలో 87 శాతానికి పైగా గ్రామాల్లో స్థానికంగానే తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు అవస­ర­మైన కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర జలశక్తి శాఖ గణాంకాల్లో తేలింది. 18,393 గ్రామా­లుండగా, 96 శాతానికి పైగా అంటే 17,772 గ్రామాల్లోని వన­రుల వద్ద రెండు విడతల పాటు పరీక్షలు నిర్వహించి­నట్లు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.64 లక్షల తాగునీటి వనరుల వద్ద పరీక్షలు నిర్వహించగా, 21,193 చోట్ల వివిధ రకాల కాలుష్య కార­కాలను గుర్తించారని తెలిపింది. అందులో 20,739 చోట్ల ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రక్షిత మంచినీటి వ­న­రులు కల్పించినట్లు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.

చ‌ద‌వండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్‌ చేస్తోన్న చాట్‌జీపీటీ...

Published date : 23 Jan 2023 01:34PM

Photo Stories