Skip to main content

Diploma in Elementary Education 2022–24: 19 నుంచి డీఈడీ 1st సెమిస్టర్‌ పరీక్షలు

ఒంగోలు: డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ 2022–24 బ్యాచ్‌, 2020–22 , 2021–23 సంవత్సరాల్లో పరీక్షలు రాసి ఫెయిలైన విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 19 నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ వీఎస్‌ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
19 నుంచి డీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు
19 నుంచి డీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.100, రెండో సబ్జెక్టుకు రూ.120, మూడో సబ్జెక్టుకు రూ.140, అంతకు మించి సబ్జెక్టుకు రూ.150 పరీక్ష ఫీజు ఈ నెల 30వ తేదీ లోగా చెల్లించాలన్నారు. సెప్టెంబర్‌ 6వ తేదీ లోగా రూ.50 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also read: Nadu Nedu: Revolutionizing AP Govt Schools with AI Technology #sakshieducation

Published date : 23 Aug 2023 07:48PM

Photo Stories