Skip to main content

Gurukula College: విద్యార్థినుల ఆందోళన

కొణిజర్ల: వంట సరిగా వండటం లేదని, రుచిగా లేక తినలేకపోతున్నామని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ మండలంలోని తనికెళ్లలో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు సోమవారం ఆందోళనకు దిగారు.
ఆందోళనకు దిగిన విద్యార్థినులు
ఆందోళనకు దిగిన విద్యార్థినులు

తనికెళ్లలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తెలంగాణ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కొనసాగుతుండగా 250 మంది బాలికలు చదువుతున్నారు. కొన్ని రోజులుగా భోజనం సరిగా లేదని వీరు చెబుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉమాదేవి చేరుకుని మాట్లాడగా, వంట ఏజెన్సీని మార్చాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ప్రిన్సిపాల్‌ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Also read: 

Published date : 14 Nov 2023 02:32PM

Photo Stories