Skip to main content

KNRUHS: పీజీ డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎండీఎస్‌ సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి 19 వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
KNRUHS
పీజీ డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని పీజీ డెంటల్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

చదవండి: After‌ Inter‌ BiPC: అవకాశాలు భేష్‌!

ఆగస్టు 17న ఉదయం 8 గంటల నుంచి 19న సాయంత్రం 4 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.inను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో కోరాయి.

Published date : 17 Aug 2023 03:42PM

Photo Stories