గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో జూలై 25వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ జూలై 23న ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగులకు జాబ్ మేళా
జోసిల్ లిమిటెడ్, ఫ్లిప్కార్ట్, మాస్టర్ మైండ్స్, హెల్త్కేర్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం టెన్త్, ఆపైన విద్యార్హతలు కలిగి, 18నుంచి 45ఏళ్ల లోపు వ యసు ఉన్న నిరుద్యోగులు మంగళవారం గుజ్జనగుండ్లలోని డీమార్ట్ ఎదుట ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూ చించారు.
విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్తో పాటు పాస్పోర్ట్ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని, ఇతర వివరాలకు తమ ప్రతినిధి పి.మణిదీప్ను 8074607278 నంబర్లో సంప్రదించాలని కోరారు.