భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో ఔట్డోర్ ప్రోగ్రాం శిక్షణ కోసం గిరిజన గురుకులం సొసైటీ విద్యార్థులను పంపించినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ జూలై 19న ఒక ప్రకటనలో తెలిపారు.
ఔట్డోర్ రాక్ క్లైంబింగ్కు ఈ విద్యార్థులు
జూలై 18న ప్రారంభమైన ఈ శిక్షణ 22 వరకు జరుగుతుందని చెప్పారు. ఐదు రోజుల కోర్సుకు రాష్ట్రంలోని 10 వివిధ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 70 మంది విద్యార్థులను పంపించామని వెల్లడించారు. విద్యార్థులకు హైకింగ్, రాక్ క్లైంబింగ్, రాపెల్లింగ్ మొదలైన యాక్టివిటీల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు.