Skip to main content

OU Centenary Pylon Inaugurated: ఓయూ పైలాన్‌ ప్రారంభం

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో వందేళ్ల శతాబ్ది ఉత్సవాల పైలాన్‌ను బుధవారం ఎమ్మెల్సీ సురభి వాణి ప్రారంభించారు.
OU Centenary Pylon

ఓయూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా 2017లో పైలాన్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.

రూ.1.58 కోట్ల వ్యయంతో గత ఏడాది ప్రారంభమైన పనులు ఇటీవల ముగిశాయి. ప్రారంభానికి ముఖ్యఅతిథిగా తొలుత సీఎం రేవంత్‌ రెడ్డి హాజరవుతారని నిర్ణయించారు.

చదవండి: New Courses Offered: సైఫాబాద్ పీజీ కాలేజీలో కొత్త కోర్సు

ఆయన బిజీగా ఉండి రాలేక పోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. కానీ ఆయన కూడా హాజరుకాలేదు, చివరకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభివాణి చేతుల మీదుగా పైలాన్‌ను ప్రారంభించారు.
 

Published date : 14 Mar 2024 05:28PM

Photo Stories