ట్రిపుల్ఐటీ హైదరాబాద్లో కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్ఐటీ)æఅనే ఫుల్టైమ్ పోస్టుగ్రా డ్యుయేషన్ ను కోర్సును ఆన్ లైన్, ఆఫ్లైన్ విధానంలో 2022 ఆగçస్టు నుంచి ప్రారంభించనున్నారు.
ట్రిపుల్ఐటీ హైదరాబాద్లో ఎంఎస్ఐటీ కోర్సు
విద్యార్థులు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుల్స్టాక్ యాప్ డెవలప్మెంట్లో ఏదైనా స్పెషలైజేషన్ ను కూడా ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో మూడు సెమిస్టర్లు థియరీ, నాలుగో సెమిస్టర్ ఇండస్ట్రీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆన్ లైన్ ఎంఎస్ఐటీ ప్రోగ్రామ్ కోసం రూ.2లక్షలు, రెగ్యులర్ ఎంఎస్ఐటీ కోసం రూ.3లక్షలు కోర్సు ఫీజుగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.msit.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.