Skip to main content

వయోపరిమితిపై సానుకూల నిర్ణయం తీసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వయోపరి మితి సడలింపును 44 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూచిం చింది.
Make a positive decision on the age limit
వయోపరిమితిపై సానుకూల నిర్ణయం తీసుకోండి

2017 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయని కారణంగా నిరుద్యోగుల వయోపరిమితిని పెంచాలని కోరుతూ ఏ.వెంకన్నతోపాటు మరో ఐదుగురు హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. తమిళనాడులో మినహాయింపు ఇచి్చనట్లుగానే తెలం గాణలోనూ ఇవ్వాలని బి.రాములు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి, సానుకూల నిర్ణ యం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించా రు. మూడు వారాలు గడువిస్తూ, తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేశారు.

Sakshi Education Mobile App
Published date : 04 May 2022 12:59PM

Photo Stories