సాక్షి, అమరావతి: విజయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ (సీపెట్) కోర్సులో డిప్లొమా, పీజీ డిప్లొమాల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ డైరెక్టర్ సీహెచ్.శేఖర్ మే 19న ఒక ప్రకటనలో తెలిపారు.
CIPETలో ప్రవేశాల దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
భారత ప్రభుత్వ సంస్థ సీపెట్లో మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ), ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సులకు పదో తరగతి ఉత్తీర్ణులు, రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీ–పీపీటీ) కోర్సుకు బీఎస్సీ ఉత్తీర్ణులు, చివరి ఏడాది చదువుతున్న వారు అర్హులని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.250, మిగిలిన వారికి రూ.500 రుసుము చెల్లించి www.cipet.gov.in వెబ్సైట్లో మే 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 11వ తేదీన ప్రవేశపరీక్ష జరుగుతుందని తెలిపారు. వివరాలకు 9985941979 నంబరులో సంప్రదించాలని సూచించారు.