వట్పల్లి(అందోల్): అగ్రిసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకును సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన గొట్టి ముక్కుల తేజశ్రీ సాధించింది.
అగ్రిసెట్లో జోగిపేట విద్యార్థిని స్టేట్ ఫస్ట్
అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత పరీక్ష నిర్వహించగా 87 మార్కులను (హాల్ టికెట్ నంబర్ టీఎస్పీ 202330012) సాధించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని తునికిలోని డి.రామనాయుడు విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ టెక్నాలజీలో డిప్లామా అండ్ సీడ్ టెక్నాలజీలో రెండు సంవత్సరాల కోర్సును పూర్తి చేసింది.
ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని, కళాశాల అధ్యాపకుల శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సాధ్యమైందని తేజశ్రీ ‘సాక్షి’కి తెలిపారు.