Skip to main content

Organ Donation: అవయవదాతల్లో.. పురుషుల కంటే... మహిళలే ఎక్కువ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివ‌రాల మేర‌కు..
More Women than Men become living Organ Donors

అవయవ దానంతో చిరంజీవులుగా నిలిచిపోయి, మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే దాతలు ప్రతి ఏటా పెరుగుతున్నారు.  దేశంలో 2019లో 12,666 అవ‌య‌వ దానాలు జ‌ర‌గ్గా, 2023లో ఈ సంఖ్య 18,3785కి పెరిగింది.

➣ 2023లో మొత్తం అవయవదానం చేసినవారి సంఖ్య 16,542, జరిగిన మొత్తం అవయవదానాల సంఖ్య 18,378.

➣ 2023లో అత్యధికంగా 13,426 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌లు, 4,491 కాలేయ ట్రాన్స్ ప్లాంటేషన్‌లు జరిగాయి.

➣ గుండె మార్పిడి 221 మందికి జరగ్గా, ఊపిరితిత్తుల మార్పిడి 197 మందికి జరిగాయి.

➣ బ‌తికి ఉండి అవయవదానం చేసిన వారిలో మహిళలే ఎక్కువ కావడం విశేషం. వారి సంఖ్య 9,784 కాగా, మగవారి సంఖ్య 5,651.

Nijut Moina Scheme: బాల్య వివాహాలను అరికట్టేందుకు కొత్త పథకం ప్రారంభం

రాష్ట్రాలవారీగా చూస్తే.. తాము మరణిస్తూ మరో లునగురికి జీవితాన్నిచ్చిన వారు తెలంగాణలో ఎక్కువ. అక్కడ 252 మంది అవయవదానం చేశారు. తరవాతి స్థానాల్లో 178 మందితో తమిళనాడు, కర్ణాటక, 148 మందితో మహారాష్ట్ర, ఆ 146 మందితో గుజరాత్, 66 మందితో ఢిల్లీ, 41 మందితో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి.

Published date : 14 Oct 2024 03:15PM

Photo Stories