MPs Salaries Hike: ఎంపీలకు జీతం, పెన్షన్ను పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే..

ఉభయ సభల్లోనూ ఎంపీలకు జీతాలను పెంచుతున్నట్లు అధికారికంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది.
కేంద్ర ప్రభుత్వం ఎంపీలు, భవిష్యత్ ఎంపీలకు సంబంధించిన జీతం, రోజువారీ అలవెన్స్, పెన్షన్, అధిక పెన్షన్ పెంచినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ పెంపులు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పు "జీతం, అలవెన్సెస్, అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్, 1954 చట్టం" ఆధారంగా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం, 1961లో సూచించిన కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ను ఆధారంగా తీసుకుని చేయబడింది.
కొత్తగా అమలు చేయబడిన పేమెంట్స్..
జీతం: ఎంపీల నెలవారీ జీతం రూ.1,00,000 నుంచి రూ.1,24,000కు పెరిగింది.
రోజువారీ అలవెన్స్: రోజువారీ అలవెన్స్ రూ.2,000 నుంచి రూ.2,500కు పెరిగింది.
పెన్షన్: మాజీ ఎంపీల నెలవారీ పెన్షన్ రూ.25,000 నుంచి రూ.31,000కు పెరిగింది.
అధిక పెన్షన్: మాజీ ఎంపీలకు ప్రతి సంవత్సర సేవకు అందించే అధిక పెన్షన్ రూ.2,000 నుంచి రూ.2,500కు పెరిగింది.