పరిశోధనలు, ప్రజారోగ్యం తదితర అంశాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కాకినాడ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
హెల్త్ వర్సిటీ, జేఎన్టీయూకే ఒప్పందం
ఈ సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ వర్సిటీలో ఆగస్టు 11న రెండు యూనివర్సిటీల అధికారులు MOU పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. ఏజెన్సీ ఏరియాల్లో సికిల్ సెల్ ఏనీమియాతో పుట్టిన చిన్నారులపై పరిశోధనలతో పాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన పలు అంశాల్లో కలిసి పనిచేసేందుకు వారు అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి. శ్యామ్ప్రసాద్, జేఎన్టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు పాల్గొన్నారు.