రాష్ట్రంలోని వర్సిటీలను క్లస్టర్గా ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న వనరులను సమష్టిగా ఉపయోగించుకునేందుకు.. బోధన, పరిశోధనల్లో పరస్పర సహకారం దిశగా సంస్కరణలు జరుగుతున్నాయి.
ఉన్నత విద్యా మండలి ప్లానింగ్ బోర్డు సమావేశం
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్లానింగ్ బోర్డు మూడో సమావేశం జూలై 29, 30 తేదీల్లో అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగనుంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు JNTU(A) వీసీ జింకా రంగజనార్దన జూలై 28న రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్తో సమావేశమై పలు సూచనలు చేశారు.