Skip to main content

Ashok Kumar Mittal: ప్రధానిని కలిసిన ఎల్పీయూ చాన్స్‌లర్‌

సాక్షి, హైదరాబాద్‌: లవ్లీ ప్రొఫెషనల్‌ యూని వర్సిటీ (ఎల్పీయూ) చాన్స్‌లర్, రాజ్యసభ సభ్యుడు అశోక్‌కుమార్‌ మిట్టల్‌ ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా కలిశారు.
Chancellor of LPU who met the Prime Minister
ప్రధానిని కలిసిన ఎల్పీయూ చాన్స్‌లర్‌

ఈ సందర్భంగా 2019లో భారతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సందర్భంగా ప్రధాని ఎల్పీయూ సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు ఉన్నత విద్యలో పరిశోధనలు, ఆవిష్కరణల ప్రాముఖ్యంపై అశోక్‌ తన ఆలోచనలు పంచుకున్నారు.

చదవండి: Lovely Professional University: సీయూఈటీ ఆధారంగా LPUలో అడ్మిషన్లు

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌లో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నందుకు ప్రధానికి అశోక్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) ప్రశంసించారు.   

చదవండి: Microsoft Ambassador: మైక్రోసాఫ్ట్‌ అంబాసిడర్‌గా ఎల్పీయూ విద్యార్థి

Published date : 10 Aug 2023 01:32PM

Photo Stories