SSC & Inter Exams: ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Sakshi Education
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 17న ప్రారంభమయ్యాయి.
ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు మొత్తంగా మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్సెస్సీలో 122 మంది విద్యార్థులకు 104 మంది, ఇంటర్లో 107 మందికి 93 మంది విద్యార్థులు హాజరయ్యారు.
జిల్లాకేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు పరీక్ష కేంద్రాన్ని డీఈఓ రవీందర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.