Skip to main content

MLA Rs 2.25 lakh help: పేద విద్యార్థినికి ఎమ్మెల్యే రూ.2.25 లక్షల సాయం

MLA Rs 2.25 lakh help to poor student

జి.కొండూరు: పేద విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు. మండలంలోని చెర్వుమాధవరం గ్రామానికి చెందిన బాణావతు శ్రావణి అమెరికాలో ఎంఎస్‌ చదవడానికి వెళ్తోంది. ఆమె విమాన టికెట్ల ఖర్చుల నిమిత్తం రూ.2.25 లక్షలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ తన సొంత నిధుల నుంచి అందజేశారు. ఈ నగదుతో రిజర్వ్‌ చేసిన విమాన టికెట్లను శుక్రవారం వైఎస్సార్‌ సీపీ స్థానిక నాయకులు విద్యార్థిని శ్రావణికి అందజేశారు. శ్రావణి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వంలో తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ని విదేశీ విద్య కోసం ఆర్థిక సాయం చేయాలని కోరామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో సాయం చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలోఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, సచివాలయాల మండల కన్వీనర్‌ కాజా బ్రహ్మయ్య, కేడీసీసీబీ డైరెక్టర్‌ గుమ్మడపు రవీంద్రరాణా, వైస్‌ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నెల్లూరి లీలాశ్రీనివాసరావు, సర్పంచ్‌ దేశం సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Jagananna Videshi Vidya Deevena Scheme: విదేశీ కల విద్యా దీవెనతో సాకారం.. 21 మందికి రూ.3.37 కోట్లు అందజేత

Published date : 29 Jul 2023 03:28PM

Photo Stories