Junior Colleges: 3,618 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవల పునరుద్ధరణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,618 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీల సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది.
3,618 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవల పునరుద్ధరణ
2023–24 విద్యాసంవత్సరానికిగాను వీరి సేవలను జూన్ ఒకటి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తూ మే 25న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ను ఆదేశించారు.