మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి ప్రవేశాలకు మే 23న విద్యార్థుల ఎంపిక జరిగింది.
బీసీ గురుకులాల్లో విద్యార్థుల ఎంపిక
రాష్ట్రంలో 101 బీసీ గురుకులాల్లో 31,952 మంది దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిపారు. 5,620 సీట్లకు గాను మొదటి విడతలో 5,482 మందికి ప్రవేశ అర్హత కల్పించినట్టు విద్యాలయాల సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. వీరంతా జూన్ 10వ తేదీలోపు వారికి కేటాయించిన గురుకులాల్లో తగిన ధ్రువపత్రాలతో సీటు పొందాలని సూచించారు.