Skip to main content

All India Children’s Educational eContent Competitionలో మన రాష్ట్రానికి బహుమతులు

ఆలిండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఇ- కంటెంట్ పోటీలో మన రాష్ట్రానికి రెండు ప్రథమ బహుమతులు.
All India Children’s Educational eContent Competition
All India Children’s Educational eContent Competitionలో మన రాష్ట్రానికి బహుమతులు
  • సైట్ - ఎస్సీఈఆర్టీ సిబ్బందిని అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు

ఆలిండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఇ- కంటెంట్ 2022-23 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు ప్రథమ బహుమతులు దక్కాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గారు ఓ ప్రకటనలో తెలిపారు. Central Institute of Educational Technology (CIET), NCERT న్యూదిల్లీ వారి ఆధ్వర్యంలో మార్చి27న అవార్డుల ప్రదానం జరిగింది. 

చదవండి: Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకత, విద్యాబోధన, ప్రవేశ విధానం.. ముఖ్య‌ వివరాలు ఇవే..
ఆడియో, వీడియో విభాగాల నుండి ఏడు విద్యా కార్యక్రమాలు స్క్రీనింగుకు ఎంపికవ్వగా, వాటిలో ఆడియో కేటగిరిలో సైట్- ఎస్సీఈఆర్టీ ప్రొడక్షన్ రూపొందించిన 'రంగులకల', వీడియో కేటగిరిలో ఏపీ మోడల్ స్కూల్ (కుప్పిలి, శ్రీకాకుళం) టీజీటీ P. రామకృష్ణ ఆధ్వర్యంలో ఏడో తరగతి విద్యార్థి ఎన్.పవన్ రూపొందించిన 'డైవర్స్ మోషన్'కు మొదటి బహుమతులు దక్కాయి. 

చదవండి: Twitter Logo: పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్‌ లోగోను మార్చిన మస్క్!
ఈ సందర్భంగా సైట్ ,ఎస్సీఈఆర్టీ సిబ్బందిని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ అభినందించారు.

చదవండి: Admissions in Ekalavya Adarsha Gurukula Vidyalaya: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా‌..

ఫొటోలు:

  1. సైట్ - ఎస్సీఈఆర్టీ సిబ్బందిని అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు
  2. వీడియో విభాగంలో ప్రథమ బహుమతి 'డైవర్స్ మోషన్'. 
  3. ఆడియో విభాగంలో ప్రథమ బహుమతి పొందిన 'రంగులకల'
Published date : 04 Apr 2023 05:47PM

Photo Stories