Boxing Competition: టీటీడబ్ల్యూఆర్డీసీ విద్యార్థులకు పతకాలు
కొత్తగూడెంటౌన్: వరంగల్లో ఇటీవల జరిగిన బాక్సింగ్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (టీటీడబ్ల్యూఆర్డీసీ)ల విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు.
పాల్వంచ కళాశాలకు చెందిన సుల్తాన్ మురారి, హరిప్రియ, కొత్తగూడెంనకు చెందిన తుస్మరేఖ వివిధ విభాగాల్లో సత్తా చాటి పతకాలు గెలుచుకున్నారు. ఆయా విద్యార్థులను ప్రిన్సిపాళ్లు బి.రాజేశ్వరి, చిన్నప్పయ్య, కోచ్ సత్యంబాబు నవంబర్ 22న అభినందించారు.
చదవండి:
Fencing Competition: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు కొత్తగూడ విద్యార్థి
#Tags