DMHO Dr. S. Bhaskara Rao: పారదర్శకంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పారదర్శకంగా జరుగుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వైద్యారోగ్యశాఖలో ఉన్న వివిధ కేటగిరీల్లో ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్ మేల్, ఫిమేల్ కాంట్రాక్ట్ పద్ధతిలో 2014కు ముందునుంచి పనిచేస్తున్నారని, వారిని శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించే ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. దీనిపై ఎవరికీ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, ఎవరైనా అడిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
#Tags