Medical College: సెప్టెంబర్ 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు..
మెడికల్ కళాశాల నిర్మాణం, తదితర అంశాలకు సంబంధించి అధికారులతో ఆయన సోమవారం తన చాంబర్లో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి సౌకర్యాలను పూర్తి చేయాలన్నారు. కళాశాలకు సంబం ధించి ప్రారంభ దశలో ఇప్పటి వరకు 64 మంది విద్యార్థులు చేరారన్నారు.
also read: AP Students Chosen for United Nations Forum Meet | CM YS Jagan | #sakshieducation
విద్యార్థులకు వసతి కల్పించేందుకు నిర్మించిన వసతిగృహాలు, గ్యాలరీల నిర్మాణాల పురోగతిపై ఆరాతీశారు. విద్యార్థులు బస చేసేందుకు వసతిగృహాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించాలని సూచించారు. నీటి సరఫరా కోసం శాశ్వత పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కళాశాలలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో పనులు పూర్తయ్యా యని వివరించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి భవనాలు కళాశాలకు అప్పగిస్తామని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్కు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు, లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కళాశాల నిర్వహణ కోసం ఇప్పటి వరకు భర్తీ చేసిన పోస్టులు, ఇంకా చేయాల్సినవి, అవసరమైన సిబ్బంది వివరాలతో వెంటనే నివేదిక సమర్పించాలని ప్రిన్సిపాల్ను కోరారు.
Also read: Nadu Nedu: Revolutionizing AP Govt Schools with AI Technology #sakshieducation