Skip to main content

Telangana University: అక్ర‌మ నియామ‌కాలు, ప‌దోన్న‌తులు రద్దు... పాత రిజిస్ట్రార్‌ జౌట్‌.. కొత్త‌గా యాద‌గిరికి ప‌గ్గాలు

తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, ప్రమోషన్లు రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వీసీ రవీందర్​ గుప్తా చెక్​ పవర్స్​ను కూడా రద్దు చేసి ఈసీకి ట్రాన్స్​ఫర్ ​చేసింది. 17 నెలల తరువాత హైదరాబాద్​లోని రూసా రిసోర్స్​ బిల్డింగ్​ లో బుధ‌వారం జరిగిన టీయూ ఈసీ మీటింగ్​ వాడీ వేడిగా జరిగింది. స్టేట్ ​హయ్యర్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ సెక్రటరీ వాకాటి కరుణ అధ్యక్షతన మీటింగ్​ నిర్వహించారు.
Telangana University
Telangana University

చ‌ద‌వండి: 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు...

కొద్దిసేపటికే బయటకు వెళ్లిపోయిన వీసీ
ఉదయం 10.30 గంటలకు మీటింగ్​ స్టార్ట్​ అయ్యింది. మీటింగ్​కు వాకాటి కరుణ తో పాటు, కాలేజ్​, టెక్నికల్​ ఎడ్యుకేషన్​ కమిషనర్​ నవీన్​ మిట్టల్​, స్టేట్​ ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ డిఫ్యూటీ కమిషనర్​ చంద్రకళ, వీసీ రవీందర్ ​గుప్తా, ఈసీ మెంబర్లు హాజరయ్యారు. వీసీ అపాయింట్​ చేసిన రిజిస్ట్రార్​ విద్యావర్ధిని మీటింగ్​ హాల్​లోకి రాగా, మెంబర్స్​ ఆమెను రిజిస్ట్రార్​ గా గుర్తించలేదు. మీటింగ్​ హాల్​ నుంచి బయటకు పంపించారు. గతంలో ఈసీ నియమించిన ప్రొఫెసర్​ యాదగిరి ని తిరిగి రిజిస్ట్రార్​ గా నియమించారు. ఆయన్ని రెండేళ్ల పాటు ఆ పదవి లో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఉన్న‌త విద్యామండ‌లి అధికారుల‌తో వీసీ వాగ్వివాదానికి దిగారు. వీసీ తీరుపై ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమి లేక మీటింగ్​ మొదలైన కాసేపటికే ఆయన బయటకు వెళ్లిపోయారు. అయినప్పటికి ఈసీ రూల్స్​ కి అనుగుణంగా వీసీ లేక పోయినా మీటింగ్​ కొనసాగింది. 

 చ‌ద‌వండి: ఏప్రిల్ 24 నుంచి కానిస్టేబుల్ ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌..
కమిటీ ఏర్పాటు..!
2021 డిసెంబర్​ 9 న వీసీ ప్రొఫెసర్​ శివశంకర్​ ని రిజిస్ట్రార్​ గా నియమించారు. ఆ రోజు నుంచి నేటి వరకు చేపట్టిన అక్రమ నియామకాలను, ప్రమోషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ లో దాదాపు 130 మంది వరకు ఉద్యోగులను నియమించారని, వారెవరూ గురువారం నుంచి వర్సిటీ లోకి రావడానికి వీల్లేదని అధికారులు ఆదేశించారు. అవసరమైతే కలెక్టర్​, సీపీతో మాట్లాడుతామని చెప్పారు. అలాగే ఇన్ని రోజుల పాటు వారికి ఇచ్చిన శాలరీలు, ప్రమోషన్లతో అదనంగా శాలరీ పొందిన వారి నుంచి కూడా డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. గ‌త డిసెంబర్​ 9వ తేదీ నుంచి చేసిన ప్రతి చెల్లింపుని పరిశీలించేందుకు పైవ్​ మెంబర్​ కమిటీ ని ఏర్పాటు చేశారు.  అక్రమాలు, అవినీతి పై అవసరమైతే ఏసీబీతో విచారణ జరిపించాలన్న అంశం పై చర్చ జరిగింది.

చ‌ద‌వండి: న‌ర్సింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌... రూ.80 వేల జీతంతో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు..​​​​​​​
2 నెలల పాటు ప్రతి వారం ఈసీ మీటింగ్ 

టీయూలో జరిగిన అవకతవకల పై ప్రభుత్వం సీరియస్​ గా ఉందని  హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఆఫీసర్లు తెలిపారు. యూనివర్సిటీ ని గాడిలో పెట్టేందుకు ఇక నుంచి ప్రతి వారం ఈసీ మీటింగ్​ ఉంటుందని చెప్పారు. తర్వాతి మీటింగ్​ ఈ నెల 26 న హైదరాబాద్​ లో జరుగుతుందని పేర్కొన్నారు.

Published date : 20 Apr 2023 06:56PM

Photo Stories