Skip to main content

School Students : ఈ టీచ‌ర్ మాకొద్దంటూ విద్యార్థుల ఆందోళ‌న‌..

Students refuses their telugu teacher for studies

వీరబల్లి: మండలంలోని ఒంగిమల్ల ఉప్పరపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు టీచర్‌ తమకు వద్దంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. టీచర్‌ చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. ఈ విషయంపై పదో తరగతి విద్యార్థులను అడుగగా.. తెలుగు టీచర్‌ సక్రమంగా అర్థమయ్యేటట్లు పాఠాలు చెప్పడం లేదని, చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

Pre PhD Exams: ప్రీ పీహెచ్‌డీ పరీక్ష.. నోటిఫికేషన్‌ విడుదల

అర్థం కాని పాఠాలపై సందేహాలు అడిగితే విసుక్కోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, క్లాస్‌ రూమ్‌కు వచ్చి మౌనంగా కూర్చొని ఉంటున్నారన్నారు. ఈ విషయంపై ప్రధానోపాద్యాయులు చంద్రశేఖర్‌ను వివరణ అడుగగా.. ఈ టీచర్‌కు తాను ఎంత చెప్పినా మార్పు రాలేదని తెలిపారు.

Published date : 18 Sep 2024 03:56PM

Photo Stories